
గాసిప్స్

హైదరాబాద్లోని రాయదుర్గం 46 ఎకరాల భూముల వివాదంలో తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. భూముల సర్వేపై వారం రోజుల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే సర్వే లేదా వేలం ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. తమ వాదనలు వినకుండానే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని టీజీఐఐసీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణలో టీజీఐఐసీ ఇంప్లీడ్ అయ్యి తన అభ్యంతరాలను వినిపించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే 2016 నుంచి పెండింగ్లో ఉన్న ప్రధాన రిట్ పిటిషన్ను మూడు నెలల్లోగా పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశించింది. ఈ నిర్ణయంతో కేసు విచారణ వేగవంతం కావడంతో పాటు అన్ని పక్షాలకు తమ వాదనలు వినిపించే అవకాశం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!