

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబరు 5న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన ర్యాలీని నిషేధించాలని కోరుతూ దాఖలైన అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తోసిపుచ్చారు. జులై 25న ఆందోళన విరమించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని సీజేపీ నిర్ణయించింది. తమ డిమాండ్లపై కేంద్రం స్పందించాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
నీట్ పరీక్ష రద్దు నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబ సభ్యులు, ఉద్యమ సమయంలో పోలీసుల హింసకు గురైన వారిని కూడా ర్యాలీలో పాల్గొనాలని సీజేపీ ఆహ్వానించింది. భద్రతాపరంగా సున్నితమైన ప్రాంతాల్లో ముందస్తు అనుమతులు లేకుండా భారీగా జనసమీకరణ జరగకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ విశ్రాంత పోలీసు అధికారి రాజేంద్ర సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ర్యాలీని నిషేధిస్తూ ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!