
జనరల్

ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే ఫీచర్ ఫోన్ వినియోగదార్ల కోసం యూపీఐ 123పే అనే ప్రత్యేక సేవను ఆవిష్కరించింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసేందుకు ఈ సేవ వీలు కల్పిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ఫీచర్ ఫోన్ వినియోగదార్లు డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం పొందనున్నారు. 2జీ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా నమ్మకమైన లావాదేవీలు జరగేలా ఎస్ఎంఎస్ ఆధారిత వ్యవస్థను ఈ సేవ ఉపయోగించుకుంటుంది.
ఈ సేవను విస్తరించేందుకు ఫోన్పే నోకియా, హెచ్ఎండీ, లావా ఇంటర్నేషనల్, ఐటెల్ మొబైల్ వంటి ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫోన్ కొనుగోలు చేసేటప్పుడే ప్రీ బండిల్డ్గా ఈ సేవ అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల లక్షలాది మంది వినియోగదార్లకు డిజిటల్ చెల్లింపులు మరింత సులభం మరియు అందుబాటులోకి రానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!