

మారు మూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఐడిబిఐ బ్యాంక్ సహకారంతో ఎంఎన్జే ఆసుపత్రి, ఓమెగా ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పరీక్షలు నిర్వహించే కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ ఏటీఎంలు, ఈసీజీ యంత్రాలు, ఆధునిక వైద్య పరికరాలతో ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మిస్తామని వెల్లడించారు. ఆగస్టు 4న మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాటారం డివిజన్లో ఇప్పటివరకు 680 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు, మంథని నియోజకవర్గంలో సుమారు 45 వేల మందికి కంటి చికిత్సలు అందించినట్లు మంత్రి వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!