
జనరల్

ఆంధ్రప్రదేశ్లోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ జానపద గీతం ‘ఏషనాగుల నాగుల కట్టమీద’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గాయని అదితి భవరాజు ఈ పాటను ఆలపించడంతో సభ ప్రాంగణం సందడిగా మారింది.
పాటకు స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు చప్పట్లు కొడుతూ ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. ఇదిలా ఉండగా, హీరో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలోనూ ఈ జానపద గీతాన్ని ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన ఈ పాట మరోసారి వార్తల్లో నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!