

ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలితా జ్యూవెల్లరీ విస్తరణను వేగవంతం చేస్తోంది. ఇటీవల ఐపీవోకు వచ్చిన ఈ సంస్థ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా షోరూమ్లను నిర్వహిస్తోంది. భవిష్యత్తులో మరో 110కి పైగా కొత్త షోరూమ్లను ఏర్పాటు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చైర్మన్, ఎండీ ఎం. కిరణ్ కుమార్ తెలిపారు.
దేశీయ విస్తరణలో భాగంగా ఉత్తర భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సంస్థ కసరత్తు చేస్తోంది. అంతర్జాతీయంగా మలేషియా, సింగపూర్లోనూ కొత్త స్టోర్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణ పూర్తయితే సంస్థ షోరూమ్ల సంఖ్య సుమారు 175కు చేరుకునే అవకాశం ఉంది. బంగారం ధరలు దీర్ఘకాలంలో పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, ధరల విషయంలో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిరణ్ కుమార్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!