
జనరల్

జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో ఈ భేటీ జరగనుంది. 58వ సారి జరగనున్న ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. జీఎస్టీకి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగే అవకాశం ఉంది.
గతంలో 2025 సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఆ తర్వాత దాదాపు ఏడాది విరామంతో కౌన్సిల్ మళ్లీ సమావేశం కానుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై వ్యాపార వర్గాలు, పన్ను చెల్లింపుదారులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!