
జనరల్

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన ఏడు వరి రకాల సాగుకు క్వింటాల్కు రూ.500 బోనస్ అందజేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం గుర్తించిన బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తించనుంది.
వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం గుర్తించిన ఈ ఏడు రకాల విత్తనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, వాటి విక్రయాలను ప్రోత్సహించాలని సూచించారు. రైతులు ఈ వరి రకాలను సాగు చేస్తేనే బోనస్కు అర్హులు అవుతారని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు మెరుగైన ఆదాయం అందించడంతో పాటు నాణ్యమైన వరి ఉత్పత్తిని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!