

సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల అంశంపై కీలక సమీక్ష చేపట్టనుంది. సోమవారం సచివాలయంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు, న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నారు. ముందస్తు పర్యావరణ అనుమతుల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రాజెక్టులపై దాని ప్రభావాన్ని అధికారులు పరిశీలించనున్నారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి ప్రాజెక్టుతో పాటు అనుమతుల సమస్యలు ఎదుర్కొంటున్న ఇతర ప్రాజెక్టులను విడివిడిగా సమీక్షించనున్నారు. ఆయా ప్రాజెక్టుల చట్టపరమైన స్థితి, పర్యావరణ ప్రభావ మదింపు, అటవీ, వన్యప్రాణి అనుమతులు, నిర్మాణ పురోగతి వంటి అంశాలపై నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించనున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!