
జనరల్

టాలీవుడ్లో టికెట్ ధరలు, థియేటర్ల పర్సెంటేజ్ విధానాలపై కొనసాగుతున్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ పాత కమిటీని పూర్తిగా రద్దు చేసి, ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. టికెట్ రేట్లు, పర్సెంటేజ్ విధానాలు, పరిశ్రమకు సంబంధించిన ఇతర కీలక అంశాలను ఈ కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది.
ఈ కమిటీ నివేదిక సమర్పించేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఎలాంటి గడువును నిర్దేశించలేదు. పరిశ్రమలోని అన్ని వర్గాలతో చర్చించి, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా సమయం తీసుకుని నివేదిక సిద్ధం చేయాలని కమిటీకి అవకాశం కల్పించింది. పరిశ్రమకు ఉపయోగపడే ఆచరణాత్మక సూచనలు అందించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!