

వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హాలాంగ్ బేలో శనివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో అలల ఉధృతి కారణంగా టూరిస్ట్ బోటు బోల్తాపడటంతో 15 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నారు. కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృతి చెందినట్లు తెలుస్తుండగా, ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో నలుగురు గల్లంతైనట్లు సమాచారం.
ప్రాథమిక వివరాల ప్రకారం, ఓ మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ తన డిస్ట్రిబ్యూటర్ల కోసం వియత్నాం పర్యటనను ఏర్పాటు చేసింది. ఈ పర్యటనలో మొత్తం 250 మంది పాల్గొనగా, వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బాధితుల వివరాలను గుర్తించి కుటుంబాలకు సమాచారం అందించే ప్రక్రియ కొనసాగుతోంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!