జనరల్

న్యూజిలాండ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భారత్-న్యూజిలాండ్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించేందుకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్, న్యూజిలాండ్ రెండూ తమ తమ రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నాయని చెప్పారు. న్యూజిలాండ్ను అద్భుతమైన దేశంగా అభివర్ణించిన మోదీ, అక్కడి భారతీయుల సేవలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు.
వ్యవసాయం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయవచ్చో ప్రపంచ దేశాలకు న్యూజిలాండ్ ఆదర్శంగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశంగా న్యూజిలాండ్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య విలువలు, ఆవిష్కరణలు, ప్రజల మధ్య బంధాలే భారత్-న్యూజిలాండ్ సంబంధాలకు బలమైన పునాదులని ఆయన పేర్కొన్నారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!