
జనరల్

మహారాష్ట్ర రాష్ట్రంలోని పర్బానీ జిల్లాలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. యశ్వాడి ప్రాంతంలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం ఒక్కసారిగా కుప్పకూలడంతో భక్తులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పలువురు ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం శిథిలాల కింద దాదాపు 30 మంది చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఘటనకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!