
సినిమాలు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో మృతుల గుర్తింపునకు అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి తెలిపారు. మృతదేహాలపై ఉన్న ఆభరణాలు, ఇతర గుర్తుల ఆధారంగా ముందుగా బంధువులతో గుర్తింపు ప్రక్రియ చేపడతామని చెప్పారు. వాటి ఆధారంగా గుర్తించలేని పరిస్థితుల్లో డీఎన్ఏ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తామని వెల్లడించారు.
డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలను మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు పంపించనున్నారు. పరీక్ష ఫలితాలు రావడానికి కనీసం ఐదు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించేందుకు వైద్య బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని డాక్టర్ వాణి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!