
జనరల్

ఢిల్లీలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. జంతర్ మంతర్ వద్ద తమ పార్టీ పూర్తిగా శాంతియుతంగా నిరసన తెలుపుతోందని, మద్దతు ఇవ్వాలనుకునే వారు అక్కడికే వచ్చి పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పార్టీ పేరును ఉపయోగిస్తూ నగరంలోని ఇతర ప్రాంతాల్లో కొందరు గూండాలు దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. అలాంటి వ్యక్తులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన ఆయన, హింసాత్మక చర్యలను సీజేపీతో ముడిపెట్టవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!