
జనరల్

యూట్యూబర్ రావణ్ను కస్టడీకి ఇవ్వాలంటూ గన్నవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కోర్టు జూలై 14వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణలో పూర్తి స్థాయి వాదనలు వినిపించాలని ఇరువర్గాల న్యాయవాదులకు సూచించింది.
దర్యాప్తు కొనసాగించేందుకు రావణ్ను 10 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని గన్నవరం పోలీసులు కోర్టును కోరారు. జూలై 14న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనుండగా, వాటిని పరిశీలించిన అనంతరం కస్టడీ పిటిషన్పై కోర్టు నిర్ణయం వెలువరించనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!