
జనరల్

ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా భారతీయ రైల్వే వినూత్న చర్యలు చేపట్టింది. దేశంలోనే తొలిసారిగా చెన్నైలోని పురచ్చి తలైవర్ డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది గస్తీ కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్ ట్రైక్లను ప్రవేశపెట్టింది. ఒక్క అధికారి ప్రయాణించేలా రూపొందించిన ఈ వాహనాలు స్టేషన్లో వేగవంతమైన గస్తీతో పాటు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సహాయపడుతున్నాయి.
మే నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ప్రస్తుతం మొత్తం 12 ఎలక్ట్రిక్ ట్రైక్లను గస్తీ విధుల్లో వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ఆర్పీఎఫ్ సిబ్బంది తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాన్ని పర్యవేక్షించడంతో పాటు, సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని ప్రయాణికులకు వేగంగా సహాయం అందించే అవకాశం కలుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!