

‘కల్కి 2898 ఏడీ’ ఘన విజయానంతరం దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించనున్న రెండో భాగంపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజా ప్రచారం ప్రకారం, మహాభారతంలోని కర్ణుడి కుమారుడు వృషసేనుడు కథలో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం బాలీవుడ్కు చెందిన ఓ యువ నటుడిని పరిశీలిస్తున్నారని, పలువురు ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇటీవల అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన ప్రతినాయకుడిగా మరింత విస్తృత పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే రెండో భాగానికి ‘కర్ణ 3102 బీసీ’ అనే పేరును పరిశీలిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!