

‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత యంగ్టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్కు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సుబ్రహ్మణ్య స్వామి కథల స్ఫూర్తితో రూపొందనున్న ఈ చిత్రాన్ని పౌరాణిక అంశాలతో కూడిన యాక్షన్ ఎపిక్గా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్ అత్యంత శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
2027 మార్చి తర్వాత ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్రారంభించి, అదే సంవత్సరం ద్వితీయార్థంలో చిత్రీకరణ మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ భుజం గాయం నుంచి కోలుకునే ప్రక్రియలో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్న ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత ‘డ్రాగన్’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఆ సినిమా పూర్తయిన అనంతరం మాత్రమే ‘గాడ్ ఆఫ్ వార్’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!