

హైదరాబాద్ రాయదుర్గంలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు రోబో సాయంతో మైట్రల్ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కేవలం అతి తక్కువ కోతలతో 37 ఏళ్ల యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. రాజమండ్రికి చెందిన యువకుడు మైట్రల్ స్టెనోసిస్ సమస్యతో బాధపడుతుండగా, గుండె వాల్వ్ మందంగా మారడంతో శ్వాస సమస్యలు, గుండె దడ ఎక్కువయ్యాయి. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు.
సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీలో ఛాతీ ఎముకలను కత్తిరించాల్సి ఉండగా, రోబోటిక్ విధానంలో చిన్న రంధ్రాల ద్వారా జులై 23న ఇంట్రా కార్డియాక్ సర్జరీని పూర్తి చేశారు. దెబ్బతిన్న మైట్రల్ వాల్వ్ను తొలగించి, దాని స్థానంలో మెటల్ వాల్వ్ను అమర్చారు. కిమ్స్ ఆసుపత్రిలో ఈ తరహా రోబోటిక్ గుండె శస్త్రచికిత్స ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. డా. నిసర్గ నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!