

టాలీవుడ్ సీనియర్ అగ్రహీరోలు బాలకృష్ణ, చిరంజీవి తమ తాజా చిత్రాలతో మరోసారి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. గతంలో కనిపించిన శైలికి భిన్నంగా ఈసారి ఇద్దరూ కొత్త తరహా పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బాలకృష్ణ ప్రస్తుతం తన 111వ చిత్ర పనుల్లో ఉండగా, స్వల్ప గాయం కారణంగా కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు చిరంజీవి తన 158వ చిత్ర చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. ఇద్దరి సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, కొత్త లుక్, కొత్త పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ప్రయత్నం జరుగుతోందన్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.
ఇప్పటివరకు సీనియర్ హీరోల కోసం వింటేజ్ లుక్ను ప్రధానంగా చూపించే ప్రయత్నాలు ఎక్కువగా కనిపించాయి. అయితే బాలకృష్ణ 111వ చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని ఈసారి పూర్తిగా కొత్త కోణంలో బాలయ్యను ఆవిష్కరిస్తామని చెప్పినట్లు సమాచారం. ఇదే తరహాలో చిరంజీవి 158వ చిత్ర బృందం కూడా మెగాస్టార్ను ఆధునిక శైలిలో చూపించేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పాత ఇమేజ్కు పరిమితం కాకుండా సమకాలీన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఇద్దరు అగ్రహీరోలను కొత్త వెర్షన్లో చూపించాలనే లక్ష్యంతో సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!