

అక్కినేని అఖిల్తో కలిసి నటించిన ‘లెనిన్’ సినిమాతో తొలి పెద్ద విజయాన్ని అందుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తాజాగా తన డ్రీమ్ రోల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో నటించడం తన జీవిత లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్తో కూడిన పీరియాడిక్ చిత్రంలో రాణి పాత్ర పోషించాలని ఎంతోకాలంగా కోరుకుంటున్నానని చెప్పారు. రాజమౌళి భారతీయ సినీ పరిశ్రమలో ఓ లెజెండ్ అని ఆమె ప్రశంసించారు.
తాను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కావాలని అనుకోవడం లేదని, నటిగా తన ప్రతిభను చాటుకునే బలమైన పాత్రలు చేయడమే లక్ష్యమని భాగ్యశ్రీ స్పష్టం చేశారు. ‘లెనిన్’ విజయంతో ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తుండగా, భవిష్యత్తులో రాజమౌళి సినిమాలో నటించే అవకాశం దక్కుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇదే సమయంలో ఆమె జక్కన్న తదుపరి చిత్రంలో నటించనున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!