
సినిమాలు

న్యూఢిల్లీలో నేడు అఖిల భారత జలవనరుల శాఖ కార్యదర్శుల సదస్సు నిర్వహించనున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా జలవనరుల నిర్వహణ, నీటి వినియోగం, భవిష్యత్ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించనున్నారు.
ఈ సమావేశంలో నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, సాగునీటి సామర్థ్య పెంపు, జలవనరుల సమర్థ వినియోగంపై సమీక్ష జరగనుంది. అలాగే కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, నీటి నిర్వహణకు సంబంధించిన విధానాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!