

‘బేబీ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘90’s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాలో ప్రేమ, వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివాజీ, వాసుకి ఆనంద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!