
సినిమాలు

స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి మరో క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే చిరంజీవి, వెంకటేశ్ దగ్గుబాటి, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో విజయాలు అందుకున్న ఆయన, ఇప్పుడు అక్కినేని నాగార్జునతో కలిసి కొత్త ప్రాజెక్ట్ను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా చిరంజీవి–అక్కినేని నాగార్జున కాంబినేషన్లో సినిమా తీసుకురావాలనే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే తెలుగు సినీ అభిమానులకు ఇది భారీ మల్టీస్టారర్ పండగగా మారే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!