

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కరుప్పు’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘వీరభద్రుడు’ పేరుతో విడుదలై రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సూర్య మళ్లీ మంచి ఫామ్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇక ఇదే ఏడాదిలో మరో సినిమా కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య తన 47వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే, సూర్య ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ వార్తతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా, అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!