

మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రవితేజ కెరీర్లో ఈ మైలురాయిని అందుకున్న తొలి చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచిందని తెలిపారు. టికెట్ ధరలు పెంచకుండా, పండగ సీజన్లో విడుదల కాకపోయినా ఈ స్థాయి వసూళ్లు సాధించడం విశేషమని చిత్రబృందం పేర్కొంది. కథ, కంటెంట్పై నమ్మకంతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగామని తెలిపింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తెగా కీలక పాత్రలో కనిపించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కుటుంబ భావోద్వేగాలు, కథాంశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో సినిమాకు మంచి స్పందన లభిస్తోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం వసూళ్ల జోరు కొనసాగుతుండటంతో రూ.250 కోట్ల మార్క్ను కూడా ‘ఇరుముడి’ దాటే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!