

‘మాస్ మహారాజా’ రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఆగస్టు 21న విడుదలైన ఈ సినిమా రెండో వారంలోనూ మంచి వసూళ్లు సాధిస్తూ రూ.200 కోట్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ మార్క్కు చేరువవుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. తొలి 24 గంటల్లో అత్యధిక టికెట్ విక్రయాలు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ ప్రకటించగా, ముఖ్యంగా నైజాం ప్రాంతంలో సినిమాకు వస్తున్న స్పందన విశేషంగా ఉంది.
నైజాంలో ‘ఇరుముడి’ దాదాపు రూ.36 కోట్ల షేర్ సాధించినట్లు సినీ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి. ‘టాక్సిక్’ కోసం కేటాయించిన కొన్ని థియేటర్లలోనూ తిరిగి ‘ఇరుముడి’ ప్రదర్శనలు కొనసాగుతున్నట్లు సమాచారం. దీంతో సినిమాకు ఉన్న డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ డ్రామాలో ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలో నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్లో మరో కీలక విజయంగా నిలిచే దిశగా దూసుకెళ్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!