

‘ప్రేమలు’ చిత్రంతో ఓవర్నైట్ స్టార్గా మారిన మమిత బైజు ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలను అందుకుంటున్నారు. డ్యూడ్, కర వంటి చిత్రాలతో విజయాలను అందుకున్న ఆమె, ఇప్పుడు సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమిత బైజు హీరో సూర్యపై తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. గజిని సినిమా చూసినప్పటి నుంచి సూర్య తన చిన్ననాటి క్రష్ అని తెలిపారు. గతంలో వణంగాన్ సినిమాలో ఆయనతో నటించే అవకాశం చేజారిందని, ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ ద్వారా ఆ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సెట్స్లో సూర్య క్రమశిక్షణ, నటన విధానం నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఆమె ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!