

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సింగ్ గీతం చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, సింగీతం శ్రీనివాసరావును తెలుగు సినీ పరిశ్రమకు భీష్మాచార్యుడిగా అభివర్ణించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు.
అలాగే సినీ దిగ్గజాలను గౌరవిస్తూ వారి అనుభవాన్ని కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్న నాగ్ అశ్విన్ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. సింగీతం శ్రీనివాసరావు అనుభవం, నాగ్ అశ్విన్ ఆధునిక ఆలోచనల కలయిక ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందని చెబుతూ, నటీనటులు, సాంకేతిక నిపుణులు, వైజయంతి మూవీస్ మరియు స్వప్న సినిమాస్కు విజయాభినందనలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!