
సినిమాలు

నటి రాధికా శరత్కుమార్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా మరణవార్త విని తీవ్రంగా కలత చెందారు. ఆమెను హీరోయిన్గా పరిచయం చేసిన గురువుగా భావిస్తూ, ఆయనపై అపారమైన అభిమానాన్ని ఎప్పుడూ వ్యక్తం చేసేవారు. ఆయన మృతి తాను జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఇన్స్టాగ్రామ్లో భావోద్వేగ పోస్ట్ చేశారు.
ఆమె తన సందేశంలో తన జీవితాన్ని తీర్చిదిద్దిన వారు ఇద్దరేనని—తల్లి, గురువు భారతీరాజా అని పేర్కొంటూ, ఒకే ఏడాదిలో వారిద్దరినీ కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. తన బాధను మాటల్లో చెప్పలేనని, ఆయన జ్ఞాపకాలు, నేర్పిన పాఠాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని తెలిపారు. ‘భారతీరాజా సర్, మీరు నా సర్వస్వం. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఫోటోలను పంచుకున్నారు. ఇటీవల ఆమె నటనకు నేషనల్ అవార్డు వస్తుందని కూడా భారతీరాజా ప్రోత్సహించినట్లు గుర్తుచేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!