

గత నెలలో ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్ చరణ్, ఆ చిత్రం షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయపడిన విషయం తెలిసిందే. ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చేతికి కట్టుతో కనిపించిన ఆయనకు శస్త్రచికిత్స అవసరమని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ గాయానికి సంబంధించి శస్త్రచికిత్స చేయించుకోనున్నట్లు సమాచారం. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఈ శస్త్రచికిత్స జరగనుంది.
ఈ సమయంలో రామ్ చరణ్కు అండగా ఉండేందుకు ఆయన తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు భార్య ఉపాసన కోయంబత్తూరుకు వెళ్లారు. శస్త్రచికిత్స అనంతరం చరణ్ త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు ఆశిస్తున్నారు. తదుపరి ప్రాజెక్ట్ విషయానికి వస్తే, సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!