

‘పెద్ది’ చిత్రం కోసం తాను ప్రాణం పెట్టి పనిచేశానని ప్రముఖ నటుడు జగపతిబాబు తెలిపారు. ‘అప్పలసూరి’ పాత్ర తన కెరీర్లో ప్రత్యేకమైనదని పేర్కొంటూ, ఈ పాత్రకు తగిన గుర్తింపు రావాలని ఆశిస్తున్నానన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఓ ప్రముఖ దర్శకుడు తనకు ఫోన్ చేసి, ఇలాంటి పాత్రను ఇతర భాషల నటులు చేసి ఉంటే మరింతగా హైలైట్ చేసేవారని చెప్పారని వెల్లడించారు. పరభాష నటులకు లభించే గుర్తింపు స్థానిక నటులకు ఎల్లప్పుడూ దక్కదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
షూటింగ్ సమయంలో తన ప్రతి సన్నివేశానికి చప్పట్లు కొట్టారని, అయితే సినిమా విడుదలైన తర్వాత తన పాత్ర గురించి పెద్దగా చర్చ జరగకపోవడంపై దర్శకుడు బుచ్చిబాబును ప్రశ్నించినట్లు చెప్పారు. ‘పెద్ది’కి ఇంకా మరింత ఆదరణ దక్కాల్సి ఉందని, కాలక్రమేణా ఆ గుర్తింపు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే జాన్వీ కపూర్పై జరుగుతున్న ట్రోలింగ్ను ఖండిస్తూ, దర్శకుడు చెప్పిన విధంగానే నటులు నటిస్తారని, వ్యక్తిగతంగా వారిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ విడుదలైన మూడు రోజుల్లో రూ.236 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!