

‘పెద్ది’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, దానికోసం ప్రాణం పెట్టినట్లు నటుడు జగపతి బాబు తెలిపారు. ఈ చిత్రం విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశానని చెప్పారు. రూ.300 కోట్లు పెట్టి సినిమా తీసినా, ప్రేక్షకులు టికెట్ కొనకుండా ఉంటే ప్రయోజనం లేదని, ఇండస్ట్రీ భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ‘పెద్ది’ విడుదల తర్వాత ‘అప్పలసూరి’ పాత్రపై స్పందిస్తూ, తాను చేసిన పాత్రకు తగిన గుర్తింపు రాకపోవడం బాధగా ఉందని చెప్పారు. ఇతర భాషల నటులు చేస్తే మరింత ప్రాచుర్యం దక్కేదని ఒక ప్రముఖ దర్శకుడు చెప్పిన విషయాన్ని వెల్లడించారు.
ఇండస్ట్రీలో పరభాష నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుందని పేర్కొన్న జగపతి బాబు, తాను కన్నడలో నటించినప్పుడు మంచి గుర్తింపు దక్కుతుందని అన్నారు. ‘పెద్ది’ విడుదల తర్వాత దర్శకుడు బుచ్చిబాబును తన పాత్ర గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించానని చెప్పారు. ఈ చిత్రానికి ఇంకా ఆదరణ దక్కాల్సి ఉందని, త్వరలో ప్రేక్షకుల ప్రేమ లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. జాన్వీ కపూర్పై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తూ, ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని, దర్శకుడు చెప్పినట్లు మాత్రమే నటించిందని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.236 కోట్లు వసూలు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!