

నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పెద్దగా ప్రచార కార్యక్రమాలు లేకపోయినా, సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక ఓటీటీ డీల్ ఈ చిత్రానికి కుదిరిందనే ప్రచారం కూడా కొనసాగుతోంది.
తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్తో మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజుకుంట ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ హక్కులను రూ.15 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం నిజమైతే నాగచైతన్య కెరీర్లోనే నైజాం ప్రాంతంలో అత్యధిక విలువైన డీల్గా ఇది నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందంపై చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!