

దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం 'జన నాయకుడు' త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కారణాలతో సంక్రాంతి విడుదలను కోల్పోయి జూలైలో థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ విజయ్ అభిమానుల మద్దతుతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేసింది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకోగా, ఆగస్టు 21 నుంచి తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, రేవతి, సునీల్, నాజర్ కీలక పాత్రలు పోషించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!