
సినిమాలు

నీట్-యూజీ 2026 పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎక్స్ వేదికగా స్పందించిన మహువా మొయిత్రా, ధర్మేంద్ర ప్రధాన్కు బహుశా రాజీనామా లేఖ ఎలా రాయాలో కూడా తెలియదేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే ఆరెస్సెస్ కేవలం క్షమాపణ పిటిషన్లు రాయడం మాత్రమే నేర్పిస్తుందని విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!