
రాజకీయాలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీళ్లు నింపడంపై ఎన్డీఎస్ఏ చెప్పాలని సీఎం మాట్లాడటం అజ్ఞానంగా ఉందన్నారు. ఈ బ్యారేజీల పిల్లర్లు ఎక్కడా కుంగిపోలేదని, ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం గ్రౌటింగ్ పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.
ఎల్ నినో ప్రభావం ఉన్న సమయంలో నీళ్లు నింపేందుకు సీఎం ఎన్డీఎస్ఏ ను సంప్రదించారా అని ప్రశ్నించారు. అలాగే ఇంజనీర్లను దూషించడం, అనుచిత భాష ఉపయోగించడం తగదని విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద రూ.2 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని లిఫ్ట్ చేయవచ్చని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!