
సినిమాలు

తెలంగాణలో వర్షాలు తగ్గడానికి ఎల్నీనో ప్రభావమే ప్రధాన కారణమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వం రిజర్వాయర్లను నీటితో నింపేందుకు అన్ని చర్యలు చేపడుతోందని చెప్పారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 22 రిజర్వాయర్లను నింపే ప్రణాళిక అమలులో ఉందని వెల్లడించారు.
సమ్మక్క బ్యారేజ్లో తగినంత నీటి నిల్వ ఉంటేనే పంపింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందని భట్టి పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ ఎవరి హయాంలో దెబ్బతిందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానిస్తూ, తమ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని, చేసేదే చెబుతుందని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!