
జనరల్

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల భావోద్వేగ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదని ఆమె పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయానికి వెనుక ఉన్న కృషి, పట్టుదల తనను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు.
ప్రమాణస్వీకార వేడుక సందర్భంగా తన కళ్లలో నీళ్లు తిరిగాయని, ఆ భావోద్వేగ క్షణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కూడా గమనించారని అన్నా కొణిదెల వెల్లడించారు. పవన్ కళ్యాణ్పై తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంటూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందిస్తూ పోస్ట్ను షేర్ చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!