
క్రీడలు

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఏర్పడిన ఇండియా కూటమి సోమవారం దిల్లీలో కీలక సమావేశం నిర్వహించనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దేశ రాజధానిలోని కానిస్టిట్యూషనల్ క్లబ్లో జరిగే ఈ సమావేశంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, జాతీయ స్థాయి అంశాలపై చర్చ జరగనుంది.
ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకారం 23 రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. అయితే డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సమావేశానికి దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!