

కె.టి. రామారావు తెలంగాణ భవన్లో పార్టీ ప్రత్యేక కమిటీ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై చర్చించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) అనేక ప్రాంతాల్లో ఓటర్లకు సర్ ప్రక్రియపై సరైన అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పంపిణీ చేసిన సర్ దరఖాస్తుల్లో ఇప్పటివరకు కేవలం 7 శాతం మాత్రమే తిరిగి అందాయని, జూలై 24 గడువులోపు మిగిలిన 93 శాతం పూర్తవడం కష్టమేనని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సర్ ప్రక్రియ గడువును పొడిగించాలని కేటీఆర్ ఎన్నికల కమిషన్ను కోరారు. జిల్లాల వారీగా డూప్లికేట్ ఓటర్లపై దృష్టి సారిస్తున్న కమిషన్, ఒకే వ్యక్తి పేరు వివిధ రాష్ట్రాల ఓటర్ల జాబితాల్లో ఉండే అంశాన్ని కూడా కఠినంగా పరిశీలించాలని ఆయన సూచించారు. ప్రతి ఓటరికి ఒకే చోట ఓటు ఉండే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేసినట్లు గుర్తు చేశారు. ఇదే డిమాండ్తో త్వరలోనే బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 93కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎల్ఏలకు అవగాహన సమావేశాలు నిర్వహించామని, మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలో నిర్వహిస్తామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!