
జనరల్

పార్టీలో ఎవరైనా ఆగడాలకు పాల్పడితే సహించబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను క్రమశిక్షణతో నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.
పార్టీ ఓటమి అనే మాటే ఉండదని, అందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. తప్పులు చేసిన వారిని వదిలిపెట్టబోమని, సర్వేల ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యకర్తలు ‘సీక్రెట్’ పుస్తకం చదవాలని కూడా సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!