

కర్నూలు జిల్లా చిప్పగిరిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటికి తెల్లవారుజామున చేరుకున్న పోలీసులు ఆయనను, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటన సందర్భంగా పోలీసులు సీసీ కెమెరా హార్డ్ డిస్కులను కూడా తీసుకెళ్లారని వైఎస్సార్సీపీ వర్గాలు ఆరోపించాయి. దీంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వైఎస్సార్సీపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ నాయకుడు నాగరాజు దాడి ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపై రాళ్ల దాడి జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాముడికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. అనంతరం కేసు నేపథ్యంలోనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చర్యలు చేపట్టారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!