
రాజకీయాలు

హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ AH-64 హెలికాప్టర్ కూలిపోయిన ఘటన అనంతరం ఇరాన్పై అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఈ ఘటనకు ఇరానే కారణమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం అమెరికా మిలిటరీ చర్యలకు దిగింది. అనుచిత దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఒమన్ తీర ప్రాంతంలో గస్తీ సమయంలో మంగళవారం తెల్లవారుజామున హెలికాప్టర్ కూలిపోయింది. డ్రోన్ బోట్ సహాయంతో ఇద్దరు పైలట్లను రక్షించారు. అమెరికా దర్యాప్తులో ఇరాన్ డ్రోన్ దాడి వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలినట్లు సమాచారం. ఖేష్మ్ దీవి సమీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!