
జనరల్

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. సంగారెడ్డిలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
ప్రతి ఇంటి మహిళలకు రూ.2,500 ఇస్తామని, పెన్షన్ను రూ.4,000కు పెంచుతామని ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదని ఆయన అన్నారు. ఎన్నికల హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కూడా పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!