
బిజినెస్

మహిళల టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా జట్టు అజేయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఫైనల్కు చేరుకుంది. వెస్టిండీస్తో జరిగిన సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో వరుసగా ఇది ఆస్ట్రేలియాకు ఆరో విజయం కాగా, మొత్తం ఎనిమిదోసారి ఫైనల్కు ప్రవేశించింది.
ముందుగా వెస్టిండీస్ 125/7 పరుగులు చేయగా హేలీ మాథ్యూస్ (30), డాటిన్ (26), క్యాంప్బెల్ (22) రాణించారు. ఆసీస్ బౌలర్లలో గార్డ్నర్, వేర్హామ్, మోలినెక్స్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 13 ఓవర్లలోనే 127/2తో సులభంగా ఛేదించింది. బెత్ మూనీ (61 నాటౌట్), గార్డ్నర్ (35 నాటౌట్) విజయంలో కీలక పాత్ర పోషించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!