
జనరల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్న క్రికెటర్ శశాంక్ సింగ్తో పాటు ఆయన తండ్రి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శైలేష్ సింగ్పై మధ్యప్రదేశ్ భోపాల్లో కేసు నమోదైంది. ఇంట్లో పని చేస్తున్న వంటమనిషిపై దాడి చేసి దుర్భాషలాడినట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రతీబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
బాధితుడు విపేంద్ర సింగ్ తోమర్ తన ఫిర్యాదులో మానసిక వేధింపులు, దాడి, ఫోన్ లాక్కోవడం వంటి ఘటనలు జరిగినట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల్లో అతని ముఖం, శరీరంపై గాయాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. భారతీయ న్యాయ సంహిత కింద శశాంక్ సింగ్, ఆయన తండ్రి, డ్రైవర్పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!