
రాజకీయాలు

జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిపై బల్వంతపూర్ అడ్డరోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. కరీంనగర్-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 60 మందికిపైగా ప్రయాణికులతో జగిత్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద తీవ్రతకు బస్సు డ్రైవర్ మురళి క్యాబిన్లో చిక్కుకుపోయారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి డ్రైవర్తో పాటు గాయపడిన ప్రయాణికులను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న మల్యాల సీఐ రాజ్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!