
క్రీడలు

భారత్పై ఇంగ్లాండ్ మరోసారి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చివరి మ్యాచ్లో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్, నాలుగు మ్యాచ్ల సిరీస్ను 4-0తో కైవసం చేసుకుని చారిత్రాత్మక క్లీన్ స్వీప్ నమోదు చేసింది. భారత బ్యాటర్లు, బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక మరో ఓటమిని చవిచూశారు.
ఈ విజయంతో బ్రూక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు తొలిసారి భారత్పై సిరీస్ను పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా ప్రపంచ నంబర్-1 స్థానాన్ని కూడా దక్కించుకుంది. మరోవైపు టీమిండియా నిరాశాజనక ప్రదర్శనతో సిరీస్ను ముగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!